అతని కోసం ఎంతైనా ఖర్చు చేస్తా: ప్రీతి జింటా

-

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ మెగా వేలంలోకి వస్తే తాము కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పంజాబ్ ఓనర్ ప్రీతీ జింటా వెల్లడించారు.. ‘మా టీమ్కు స్థిరత్వం, ఛాంపియన్ మైండ్సెట్ ఉన్న కెప్టెన్ అవసరం ఉందని ,అవన్నీ హిట్మ్యాన్ వద్ద ఉన్నాయి. ఐపీఎల్ 2025 వేలంలోకి అతడు వస్తే ఎంత మొత్తమైనా ఖర్చు చేసి కొనుగోలు చేస్తాం’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రీతి జింటా చెప్పారు.

కాగా, ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో పంజాబ్ కింగ్స్ టీం ఒక్క టైటిల్ కూడా కైవసం చేసుకోలేకపోయింది. ఎంతమంది కెప్టెన్లను మార్చినప్పటికీ కూడా ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు.ఇక ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లలో పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసుకోగలిగింది.ఏప్రిల్ 18వ తేదీన ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య 33 వ మ్యాచ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news