నాంపల్లి పెట్రోల్ బంకులో మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

-

నాంపల్లిలోని భారత్ పెట్రోల్ బంక్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళితే..నాంపల్లిలోని చౌరస్తా వద్ద ఉన్నపెట్రోల్ బంక్‌లో సోమవారం తెల్లవారు జామున ఓ మహిళ పెట్రోల్ పోయించుకుంటోంది. ఈ క్రమంలోనే పెట్రోల్ కోసం లైన్‌లో నిలబడ్డ మహిళా తన ముందు ఉన్న వ్యక్తిని కొంచెం ముందుకు వెళ్ళండి అని అడగడంతో ఆమెపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ కడుపులో బలంగా గుద్దాడు. వెంటనే అలర్ట్ అయిన తోటి వాహనదారులు అతన్ని అడ్డుకొని ఆందోళనకు దిగారు.

నాంపల్లి పీఎస్‌కు తోటి వాహనదారులు చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య కొద్ది సేపు ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాధితురాలి బంధువులు అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దాడికి పాల్పడిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version