పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మహిళను అత్యంత కిరాతంగా హత్యచేశారు. వివరాల్లోకి వెళితే.. రామగిరి మండల పరిధిలోని కల్వచర్ల శివారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.ఆమెను హత్య చేసి మృతదేహాన్ని గ్రామ శివారులో పడేసి దుండగులు పరారయ్యారు.
స్థానికుల సమాచారం మేరకు రామగిరి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారరు. సిమెంట్ ఇటుకతో మహిళను కొట్టిచంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలు మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరు గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా రామగిరి పోలీసులు తెలిపారు.