దేశ రాజధానిలో దారుణం.. హోటల్‌కు పిలిచి మహిళపై అత్యాచారం..

-

ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు విధించినా కామాంధుల వెన్నులో మాత్రం వణుకు పుట్టడం లేదు.. తమ కామ వాంఛ తీర్చుకోవడానికి చెడుదారులు తొక్కుతు.. స్త్రీల జీవితాలను నాశనం చేస్తున్నారు. మాయమాటలు చెప్పి నమ్మించి చివరకు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా.. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. జూన్ 3న ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తనపై అత్యాచారం జరిగిందని ఢిల్లీలోని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అత్యాచారం చేసిన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు.పోలీసులు కథనం ప్రకారం నిందితుడు, బాధిత మహిళ ఇద్దరూ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు.అత్యాచారం చేసిన నిందితుడు హైదరాబాద్ నివాసి అని, అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం తాము గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు ఢిల్లీ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version