గ్రేటర్ ఎన్నికలు : వారికే వోటు వేయండి అంటూ వైసీపీ కీలక ప్రకటన

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదని గతంలోనే ప్రకటించామని అలాగే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి గానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కి గాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మాత్రం దొరకడం లేదని పేర్కొన్నారు.

కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తమ తమ ప్రాంతాలలో ఎవరైతే అభివృద్ధి చేస్తారని భావిస్తారో ఆత్మసాక్షిగా వారికే ఓటు వేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానులు కూడా తమ తమ ప్రాంతాలలో ఎవరైతే అభివృద్ధి చేస్తారని భావిస్తారో వారికే ఓటు వేయాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version