ఈ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్‌ ముక్కలవడం ఖాయం : చంద్రబాబు

-

ఈ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్‌ ముక్కలవడం ఖాయం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీవి నవరత్నాలు కాదు.. నవమోసాలని విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ముందుకొస్తున్నామని తెలిపారు.

”రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. దళిత, గిరిజన ద్రోహి.. జలగ జగన్‌. ఓటేసిన వారిని కాటేసే రకం ఆయనది అని మండిపడ్డారు. ఏకలవ్య మోడల్‌ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. జగన్‌ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ. జాబు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలి” అని అన్నారు. విద్యుత్‌ ఛార్జీలతో పాటు అన్ని ధరలనూ పెంచేశారు. మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపుల్లేవు. ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు పోతోంది. లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ను దోచుకున్నారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఉద్యోగాల్లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version