హిందూ దేవాలయాలపై వైసీపీ ముఠాలే దాడులు చేసి టిడిపిపై ఆరోపణలు చేస్తున్నాయి: నారా లోకేష్

-

హిందూ దేవాలయాలపై వైసీపీ ముఠాలే దాడులు చేసి టీడీపీ పై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన చోటా వైసీపీ నేత వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో రూ. 25 కోట్ల విలువైన మరకత విగ్రహం బయటపడిందన్నారు. వైసీపీ చోట నేత ఇంట్లోనే ఇలా ఉంటే.. బడా నేతల ఇళ్లల్లో ఇంకెన్ని పురాతన విగ్రహాలు ఉన్నాయో? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ వైసీపీ నేతలు.. నగలు, విగ్రహాలు ఎత్తుకెళ్లారు అని భక్తుల్లో అనుమానాలున్నాయని లోకేష్ తెలిపారు. ఏపీలో అరాచక పాలన నడుస్తుంది అన్నారు లోకేష్. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రం పై పడి ప్రజాధనం దోచుకుంటే వైసీపీ నేతలు గ్రామాలపై పడుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version