ఏపీలో దారుణం : నిర్మాణంలో ఉన్న గుడి కూల్చిన వైసీపీ నేత !

-

ఏపీలో దేవాలయాల మీద దాడులు కొనసాగుతున్నాయి. అయితే కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు గత ప్రభుత్వ హయాం కంటే ఇప్పుడు తక్కువ అని చెప్పడం గమనార్హం. ఇక తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్వంత మండలంలో కొల్లాగుంట గ్రామంలో వైసిపి నేతల దౌర్జన్యకాండ బయట పడింది. నిర్మాణంలో ఉన్న వినాయకుడి గుడిని ఆ గ్రామంలోని ఓ వైసీపీ నాయకుడు కూల్చివేసినట్టు తెలుస్తోంది.

గుడి స్థలంలో మహిళా భవన్ నిర్మించడానికి ఆ గుడి నిర్మాణాన్ని ఆ నాయకుడు కూల్చివేశాడని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో పనిచేసే తాపీ మేస్త్రిలందరూ కలిసి చందాలు వేసుకుని ఈ వినాయకుడి నిర్మించడానికి తలపెట్టినట్టు తెలుస్తోంది. నిర్మాణం పూర్తి దశకు వచ్చి కుంభాభిషేకం సిద్ధమైన తరుణంలో ఇలా కూల్చివేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుడి కూల్చివేత పై గ్రామస్తులు అందరూ సంఘటితమవడంతో చేసిన తప్పును ఒప్పుకుని యథా స్థానం లో ఆలయాన్ని నిర్మించి ఇస్తానని పంచాయతీ పెద్దల సమక్షంలో సదరు వైసిపి నాయకుడు ఒప్పుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version