పాదయాత్రలో రైతుల పైకి వాటర్ బాటిళ్లు విసిరిన వైసీపీ శ్రేణులు

-

రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణుల కవ్వింపులు కొనసాగుతూనే ఉన్నాయి. రాజమహేంద్రవరం నగరంలో పాదయాత్రగా వెళ్తున్న  రైతులను రెచ్చగొట్టేలా వైసీపీ కార్యకర్తలు వాటర్‌ బాటిళ్లు విసిరారు.

రాజమహేంద్రవరంలో ఆజాద్‌ చౌక్‌ మీదుగా శాంతియుతంగా రైతులు, అఖిలపక్ష నేతలు వెళ్తుండగా నల్ల బెలూన్లు ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇటు అమరావతి రైతులు, అటు వైసీపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు.

వైసీపీ కార్యకర్తలను ఆ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌ రెచ్చగొట్టడంతోనే వారు పాద యాత్రికులపై వాటర్‌ బాటిళ్లు విసిరినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వైసీపీ దుశ్చర్యను వివిధ పార్టీల నేతలు ఖండించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version