వైసిపి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తోంది.. కానీ..?

-

పార్లమెంట్ వేదికగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీ ఎంపీలు అందరూ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ నే.. మరోవైపు జగన్ సర్కార్ పై కూడా విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి.

జగన్మోహన్ రెడ్డి సర్కార్… వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది… గిట్టుబాటు ధర కూడా ఇస్తోంది.. కానీ ఇవన్నీ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి అంటూ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి. వైసీపీ పార్టీ అంటే రైతు దుష్మన్ పార్టీ అంటూ విమర్శించారు. రైతు భరోసా లో 5000 కోత విధించారు అంటూ ఆరోపించిన ఆయన.. వ్యవసాయ విద్యుత్ మీటర్లు రైతులందరికీ ఉరితాళ్ల లాంటివి అంటూ ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version