మంత్రి పొంగులేటికి బిగ్ షాక్ తగిలింది. నా కొడుకును మీరే చంపారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బాధిత తండ్రి నిలదీశాడు. నా 25 ఏళ్ల కొడుకును పది మంది వచ్చి దారుణంగా హత్య చేశారని, ఎందుకు చంపారని అడిగితే నిందితులు మీ పేరే చెప్పారంటూ మంత్రి పొంగులేటిని మృతుడి తల్లిదండ్రులు నిలదీశారు.
మేము మీకే ఓటు వేశాం, మాకు న్యాయం చేయకపోతే మందు తాగి చనిపోతామంటూ మంత్రి పొంగులేటి కారుకు బాధితులు అడ్డం పడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నా కొడుకును మీరే చంపారంటూ మంత్రి పొంగులేటిని నిలదీసిన బాధితుడు
నా 25 ఏళ్ల కొడుకును 10 మంది వచ్చి చంపారు.. నిందితులు మీ పేరే చెప్పారంటూ పొంగులేటిని నిలదీసిన తల్లిదండ్రులు
మేము మీకే ఓటు వేశాం.. మాకు న్యాయం చేయకపోతే మందు తాగి చనిపోతామంటూ మంత్రి పొంగులేటి కారుకు అడ్డం పడిన బాధితులు pic.twitter.com/CKryamFQ5J
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025