కానిస్టేబుల్ పరుగు పందెంలో విషాదం.. యువతి మృతి

-

తెలంగాణలో జరుగుతున్న పోలీస్ సెలక్షన్స్ లో మరో అపశృతి చోటు చేసుకున్నది. పరుగు పందెంలో పాల్గొన్న ఓ యువతి కుప్పకూలిపోయింది. ఈఘటన కరీంనగర్ లోని సిటీ పోలీస్ ట్రెయినింగ్ సెంటర్ లో చోటు చేసుకున్నది.

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిశాల గ్రామానికి చెందిన 20 ఏళ్ల మమత… ఇవాళ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కు హాజరయింది. ఫిజికల్ టెస్ట్ లో భాగంగా అభ్యర్థులకు 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ పరుగు పందెంలో పాల్గొన్న మమత… పరుగు మొదలు పెట్టిన కొద్ద సేపటికే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు… మమతను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మమత మృతి చెందింది.

మమత పరిగెడుతున్న సమయంలో తన హార్ట్ బీట్ ఎక్కువైందని.. అందుకే తను స్పృహ తప్పి పడిపోయిందని.. హార్ట్ బీట్ కంట్రోల్ కాకపోవడంతో మమత మృతి చెందిందని డాక్టర్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version