దారుణం: నమ్మి పార్క్‌ వెళితే.. యువతి గ్యాంగ్‌ రేప్‌..

-

నేటి సమాజంలో రోజు రోజు స్త్రీలకు భద్రత లేకుండా పోతోంది. ఓ దుర్మార్గుడు స్నేహం అనే ముసుగులో ఓ యువతిపై తన స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో దారుణం జరిగింది. ఒక యువతి తన స్నేహితుడితో కలిసి పార్కుకు వెళ్లింది. అక్కడ కొంత మంది ఆకతాయిలు ఉన్నారు. అయితే, తన స్నేహితుడు ముందస్తు ప్రణాళికతో అత్యాచారంకు పాల్పడినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. నోయిడాలోని పార్కులో.. యువతి, తన స్నేహితుడు రంజిత్ తో కలిసి సరదాగా వెళ్లింది. అక్కడ అప్పటికే పంకజ్, పవన్ అనే మరో వ్యక్తి ఉన్నారు. వారు సదరు యువతిని బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత మహిళ విడిచి అక్కడి నుంచి పారిపోయారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరుగగా.. ఆ తర్వాత.. బాధితురాలు తన ఇంట్లో వారికి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో బాధితురాలితో కలిసి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పంకజ్,రంజీత్ లను అరెస్టు చేశారు. మరోక నిందితుడు పరారీలో ఉన్నట్లు .. నిందితులు ఘజియాబాద్ కు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version