ఆంధ్రప్రదేశ్‌లో జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణయం..

-

ఆంధ్రప్రదేశ్‌లోని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌భుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ఇతరత్రా అన్ని హిందూ దేవాలయాల్లో పనిచేసేందుకు హిందువులకు మాత్రమే అవకాశముంటుంది. అన్యమతస్థులను అనుమతించరు. ఈ మేరకు జీవోను విడుదల చేసింది.

ఒకవేళ ఎవరైనా అన్యమతస్తులు ఆయా దేవాలయాల పరిధిలో పనిచేస్తుంటే వారిని వేరే శాఖల్లోకి మార్పుచేయాలని ప్రభుత్వం తన జీవోలో ఆదేశించింది. ఎవరైనా క్రైస్తవులు లేదా ముస్లిం ఉద్యోగుల ఇళ్ళల్లో జరిగిన పండుగలు, పెళ్ళిళ్ళు ప్రార్థనలకు సంబంధించిన వీడియోలను విజిలెన్స్ శాఖకు లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌కు అందిస్తే వాటికి సంబంధించిన నిజనిర్ధారణ కోసం ఆకస్మిక తనిఖీలు జరుగుతాయి. ఆయా సమాచారం నిజమేనని రుజువైనపక్షంలో సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామ‌ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version