YS Viveka Murder Case : వివేకానంద రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో.. ఆయన సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కంపెనీలన్ని వైఎస్‌ వివేకానందరెడ్డి పేరుతోనే ఉన్నాయని.. ఆ బోర్డుల్లో ఆయనే డైరెక్టర్ గా కొనసాగారని ఆయన భార్య సౌభాగ్యమ్మ సీబీఐకి వివరించారు. ఏయో కంపెనీల్లో ఆయన వాటదారుడిగా ఉన్నారో ఆ వివరాలన్నీ పొందుపరుస్తూ సమర్పించారు.

గతేడాది జూన్‌ 13, 24 ఆగస్టు 27 తేదీలలో సీబీఐ అధికారుల ఎదుట ఆమె వాంగ్మూలం ఇచ్చారు. తన భర్త కళ్లద్దాలు లేకుండా అసలు రాయలేరని.. వివేకా హత్యకు గురైన రోజు ఆయన బెడ్‌ రూంలో తీసిన వీడియో ఫుటేజీలో కనిపించిన కళ్లద్దాల కవర్లు రెండింటిలో ఒకటి పులివెందులలోని జ్యోతి ఆప్టికల్స్‌ వద్ద కొన్నట్లు ఆమె తెలిపారు. తన భర్త వద్ద డ్రైవర్‌ గా పనిచేసిన షేక్‌ దస్తగిరి తరచూ ఆయన వద్ద చిన్న చిన్న మొత్తాల్లో అప్పులు తీసుకునేవాడని వైఎస్‌ సౌభాగ్యమ్మ తెలిపారు. ఈ కేసులో నిందితులను అస్సలు వదలవద్దని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version