నిత్యాన్నదాన ప్రసాదంపై టీటీడీ క్లారిటీ..

-

తిరుపతి : నిత్యాన్నదాన ప్రసాద కార్యక్రమం లో ఎలాంటి మార్పులు ఉండదని.. టిటిడి పై అనవసర దుష్ప్రచారం చేసే వ్యక్తులపై కేసులు పెడతామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఎస్ వి గోశాలలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలకు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలు తెలిపారు వైవి సుబ్బారెడ్డి.

ఇంతటి పవిత్రమైన రోజున శ్రీవారికి నవనీత సేవ ప్రారంభి0చడం సంతోషంగా ఉంది… ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఈ సేవలో భాగంగా స్వామి వారికి వెన్నతో నైవేద్యం సమర్పిస్తామని తెలిపారు. ప్రతిరోజూ ఈ నవనీత సేవ కార్యక్రమం కొనసాగుతుందని.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోపూజకు విశేష ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వంద ఆలయాలలో గుడికో గోమాత కార్యక్రమం జరిగిందని.. ఆ స్వామి వారికి నిత్యం సంప్రదాయ గో ఆధారిత తయారీ వాటితోనే పవిత్రంగా నైవేద్యం సమర్పిస్తున్నామని తెలిపారు. గో ఆధారిత పంటలతో భక్తులకు ప్రసాదం ఇవ్వాలని ప్రయోగాత్మకంగా అమలు చేసామని… అయితే ఇది మరోలా ప్రజల్లోకి వెళ్లడంతో ఆ ఆలోచన విరమించుకున్నామని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version