పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్… పెరిగిన బంగారం ధర…!

-

బంగారం ధరలు నిన్న తగ్గాయి. కానీ ఈరోజు రేట్లు మల్లి పెరిగాయి. పసిడి ప్రియులకి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరుగుదల కారణంగా దేశీ మార్కెట్‌ లో కూడా పసిడి ధరలు పెరిగాయి అని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

 

ఇక ఎంత రేటు వుంది అనేది చూస్తే… హైదరాబాద్ మార్కెట్‌ లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.100 పైకి కదిలింది. రూ.48,770 గా వుంది. ఇది ఇలా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.90 పైకి పెరిగింది. రూ.44,700కు చేరింది.

ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌ లో కూడా బంగారం రేట్లు బాగా పెరిగాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.03 శాతం పెరిగింది అని తెలుస్తోంది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1835 డాలర్లకు ఎగసింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు మొదలైన అంశాలు బంగారం ధర పై ప్రభావం చూపుతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news