కొత్త టెన్ష‌న్‌… కరోనా, డెంగీతో ‘డబుల్‌’ ఇన్ఫెక్షన్‌!

-

కొవిడ్‌-19 వైర‌స్ ధాటికి జ‌నం విల‌విల‌లాడుతున్నారు. కరోనా నివార‌ణ‌కు అస‌లు ఏ మందు వాడాలో స్పష్టత లేక వైద్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటువంటి సంక్లిష్ట తరుణంలో.. ‘డబుల్‌’ ఇన్ఫెక్షన్‌ కొత్త సవాల్‌ విసురుతోంది. కొవిడ్‌ ఉన్నవారిని కొత్తగా డెంగీ కూడా చుట్టుముడుతోంది. దీంతో ఏకకాలంలో రెండు ఆరోగ్య సమస్యలకు ఏ చికిత్స అందించాలో తెలియక వైద్యులు తల పట్టుకుంటున్నారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఈ తరహాలో ‘డబుల్‌’ ఇన్ఫెక్షన్‌ బారినపడిన‌ప్ప‌టి నుంచి దీనిపై దేశవ్యాప్తంగా వైద్యవర్గాల్లో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ సమస్యకు చికిత్స చేసేందుకు ప్రస్తుతానికి ప్రత్యేకమైన ప్రామాణిక చికిత్సా పద్ధతేదీ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏకకాలంలో వీటికి చికిత్సకు ఔషధాలు అందించడంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంటుందని సూచిస్తున్నారు. రక్త గడ్డకట్టకుండా ఉండేందుకు పలువురు కొవిడ్‌ రోగులకు హెపారిన్‌ ఔషధాన్ని ఇస్తుంటారు. ఇది చివరగా రక్తం దాకా చేరుతుంటుంది. డబుల్‌ ఇన్ఫెక్షన్‌ బారినపడినవారికి హెపారిన్‌ను అందించి.. వెంటనే డెంగీ చికిత్సలో భాగంగా వారి రక్తంలోకి ప్లేట్‌లెట్లు ఎక్కిస్తే తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version