రేషన్ కార్డుని ఆధార్ తో లింక్ చేయకపోతే కష్టం.. ఇలా ఈజీగా ఇంట్లో ఉండే లింక్ చేసేయండి

-

మనకు ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో రేషన్ కార్డు కూడా ఒకటి. రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడం చాలా అవసరం. ఆన్‌లైన్లో ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఈ ప్రక్రియను పూర్తి చేస్తే నిరంతరాయంగా రేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. భారత ప్రభుత్వం సబ్సిడీలు లబ్ధిదారులకు చేరడానికి ఆధార్ కార్డును రేషన్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి చేసింది.

ఇలా చేయడం వలన మోసపూరిత రేషన్ కార్డు సమస్యను పరిష్కరించొచ్చు. అంతేకాకుండా రేషన్ ప్రయోజనాల పంపిణీ కూడా మెరుగుపరచడానికి అవుతుంది. పైగా ఈ రెండు డాక్యుమెంట్లను లింక్ చేసే ప్రొసీజర్‌ను కూడా ఈజీ చేసింది. ప్రభుత్వం ఆన్‌లైన్ వ్యవస్థను దీని కోసం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనం రేషన్ కార్డును ఆధార్‌తో ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం.

రేషన్ కార్డును ఇలా ఈజీగా ఆధార్ కార్డుతో లింక్ చేయండి:

  • ముందుగా రాష్ట్ర అధికారిక ప్రజా పంపిణీ వ్యవస్థ వెబ్‌సైట్ (EPDS) లోకి వెళ్ళండి.
  • ఈ PDS వెబ్‌సైట్‌లో ఆధార్ లింకింగ్ కోసం మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  • ఆ తర్వాత “మీ ఆధార్‌ను రేషన్ కార్డుతో లింక్ చేయు” ఆప్షన్ మీకు కనబడుతుంది – దానిని సెలెక్ట్ చేసుకోండి.
  • ఇప్పుడు ఆధార్, రేషన్ కార్డు నంబర్లను ఎంటర్ చేయండి.
  • అవసరమైన వివరాలను ఇచ్చిన తరువాత, రిజిస్టర్‌డ్ మొబైల్ నంబర్‌కి ఓటిపి వస్తుంది – దానిని కూడా ఎంటర్ చేయండి.
  • ఆధార్ – రేషన్ కార్డు లింక్ విజయవంతమైనట్లు మీ ఫోన్‌కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

ఇలా లింక్ చేయడం ద్వారా కుటుంబానికి రేషన్ అందుతుంది, ఎలాంటి అంతరాయం ఏర్పడదు. అలాగే ఫోన్ నంబర్, ఫింగర్‌ప్రింట్ వెరిఫికేషన్‌తో పాటు KYC వెరిఫికేషన్‌ను కూడా ప్రభుత్వం అమలు చేసింది. రేషన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేయడమే కాదు, రేషన్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలను కూడా ఆన్లైన్లో మార్చుకోవచ్చు. జూన్ 14, 2025 వరకు ఈ గడువును పొడిగించారు. కనుక మీ వివరాలను ఈ సమయంలో అప్డేట్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news