సంజీవని పథకం లాంచ్.. ఆరోగ్య భరోసా కోసం ఏపీ ప్రభుత్వ కొత్త అడుగు!

-

సంతోషకరమైన జీవితానికి ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ అనారోగ్యం ఆసుపత్రి ఖర్చులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం మోపుతున్నాయి. ఈ కష్టాలను దూరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన కొత్త పథకమే సంజీవని. ఈ “యూనివర్సల్ హెల్త్ పాలసీ” ప్రతి కుటుంబానికి ఒక వరంగా మారనుంది. ఈ పథకం పూర్తి వివరాలు అర్హతలు, ఎలా పొందాలి అనే అంశాలు తెలుసుకుందాం.

సంజీవని పథకం: ఒక సమగ్ర ఆరోగ్య భరోసా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంజీవని పథకం (Universal Health Policy) రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉద్దేశించిన ఒక విప్లవాత్మక కార్యక్రమం.

పథకం యొక్క ప్రయోజనాలు: కుటుంబానికి రూ. 25 లక్షల కవరేజ్, ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి. నగదు రహిత సేవలు అందనున్నాయి. ఇందులో 3,257 వైద్య విధానాలకు ఉచితంగా చికిత్స అందిస్తారు. దాదాపు 2,493 నెట్‌వర్క్ ఆస్పత్రులలో ఈ సేవలను పొందవచ్చు. ప్రజల ముంగిటకే వైద్యం అంటే ఈ పథకం ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, 5 కోట్ల మందికి డిజిటల్ ఆరోగ్య రికార్డులను కూడా రూపొందించనున్నారు.

Launch of Sanjeevani Scheme – AP Government’s New Step for Health Assurance
Launch of Sanjeevani Scheme – AP Government’s New Step for Health Assurance

సంజీవని పథకం, ఎవరు అర్హులు, ఎలా పొందాలి: సంజీవని పథకానికి అర్హత విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదే “యూనివర్సల్ హెల్త్ పాలసీ” విధానం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం, కుటుంబాల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా, ఆంధ్రప్రదేశ్‌లో నివసించే ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది. ఇక ఆర్థిక స్థితితో సంబంధం లేదు, ఆర్థికంగా వెనుకబడిన 1.43 కోట్ల కుటుంబాలతో పాటు, ఇతర 20 లక్షల కుటుంబాలకు కూడా ఈ ఆరోగ్య బీమా ప్రయోజనం లభిస్తుంది.

సమగ్ర ఆరోగ్యం: ఇది ఇప్పటికే ఉన్న ఆయుష్మాన్ భారత్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలను కూడా ఏకీకృతం చేస్తుంది. పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా రూ. 25 లక్షల వరకు చికిత్స అలాగే సాధారణ కుటుంబాలకు కూడా రూ. 2.5 లక్షల వరకు ఆరోగ్య కవరేజ్ అందుబాటులో ఉంటుంది.

పథకాన్ని పొందే విధానం: సంజీవని పథకం పూర్తిగా కొత్తగా రూపొందుతున్నందున, దీనిని పొందేందుకు ఒక ప్రత్యేకమైన, సులభతరమైన ప్రక్రియను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.  సాధారణ సమాచారం మేరకు,నిర్దిష్ట నమోదు అవసరం లేదు. ఇప్పటికే వైట్ రేషన్ కార్డు (BPL కుటుంబాలు) ఉన్నవారు అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పరిధిలోని కుటుంబాలు ఆటోమేటిక్‌గా ఈ కవరేజ్‌లోకి వస్తాయి. స్మార్ట్ హెల్త్ కార్డు లను  సంజీవని పథకం కింద, రాష్ట్ర ప్రజలకు డిజిటల్ ఆరోగ్య రికార్డు మరియు హెల్త్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది. సంబంధిత డాక్యుమెంట్లును, పథకం అమలులోకి వచ్చిన తర్వాత, లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

సంజీవని పథకం అనేది కేవలం ఆరోగ్య బీమా మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అభద్రతా భావం లేకుండా జీవించే ఆరోగ్య భరోసా. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఉచిత వైద్యం అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలవనుంది.

గమనిక: సంజీవని పథకం ఇంకా ప్రారంభ దశలో ఉంది. పూర్తి మార్గదర్శకాలు, దరఖాస్తు విధానం మరియు అధికారిక నోటిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్‌సైట్ మరియు ప్రకటనలను గమనించగలరు.

Read more RELATED
Recommended to you

Latest news