సురక్షితంగా పెట్టుబడి చెయ్యాలంటే.. ఈ భీమా పధకాలను ఎంపిక చేసుకోండి..!

-

ఈ రోజుల్లో ఖర్చులు అధికమవుతున్నాయి. పైగా పొదుపు చేయడం కూడా ఎంతో కష్టమవుతోంది అనే చెప్పవచ్చు. అయితే, ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు అనేక బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రజలు ఎక్కువగా సురక్షితమైన భీమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటారు. ముఖ్యంగా, ప్రీమియం తక్కువగా ఉండే బీమా పథకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ పథకాలలో, పోస్ట్ ఆఫీస్ బీమా పథకాలు కూడా ఒకటి. ఈ పథకంలో ప్రీమియం తక్కువగా ఉండటమే కాకుండా, బోనస్ కూడా వార్షికంగా అందజేస్తారు.

ఇతర కంపెనీలతో పోలిస్తే, పోస్ట్ ఆఫీస్ బీమా పథకాల వార్షిక బోనస్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ప్రజలు ఈ పథకాల పై ఆసక్తి చూపిస్తున్నారు, ఎంతో ప్రయోజనాన్ని పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ బీమా పథకానికి సౌకర్యం కల్పించడంతో, ప్రజలు దీనిలో పెట్టుబడి చేస్తున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన వార్షిక బోనస్ వెయ్యి రూపాయలకు 42 నుండి 75 రూపాయల వరకు ఉంటుంది. అయితే, ఇతర బీమా కంపెనీలు ఇటువంటి పాలసీలకు 38 రూపాయల వరకు మాత్రమే బోనస్ అందజేస్తాయి.

అందువల్ల ప్రైవేట్ కంపెనీలకు బదులుగా పోస్ట్ ఆఫీస్ బీమాను ఎంపిక చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకంలో 10 లక్షల రూపాయలు పెట్టుబడి చేస్తే, 33 లక్షల వరకు తిరిగి పొందవచ్చు. పైగా ఇది ఎంతో సురక్షితం, అలాగే పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో దీని పై అవగాహన పెంచేందుకు పోస్ట్ ఆఫీస్ ప్రచారాలను నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఈ పాలసీలో పెట్టుబడి చేసిన మూడు సంవత్సరాల తర్వాత, రుణం పొందే అవకాశాన్ని కూడా అందజేస్తుంది. కాబట్టి ఈ ఆర్థిక ప్రయోజనాలను పొందాలంటే, తప్పకుండా ఈ పోస్ట్ ఆఫీస్ భీమా పాలసీలో పెట్టుబడి చేయడం ఎంతో ప్రయోజనకరం.

 

Read more RELATED
Recommended to you

Latest news