హాస్యనటుడు డాక్టర్ బ్రహ్మానందం గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు. తెలంగాణ పర్యావరణ సంరక్షకుడిగా ఓ ముద్ర వేసుకున్నారు తెరాసా రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్. పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ ప్రతీ ఒక్కరి ఇంట్లో చెట్టుని నాటి తమ సన్నిహితుల ఇళ్ళలో మొక్కలు నాటించేందుకు కృషి చేయాలంటూ గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. ఇక ఇప్పటికే ఈ ఛాలెంజ్ ను ఎందరో సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు స్వీకరించారు. ఛాలెంజ్ స్వీకరించిన సినీ ప్రముఖుల్లో హీరో ప్రభాస్, చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్, వీవీ వినాయక్, యాంకర్ సుమ, అనసూయ, రష్మి తదితరులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి తమ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఇక ఇదే బాటలో ప్రముఖ యాంకర్ ఉదయభాను విసిరిన ఛాలెంజ్ ను హాస్యనటుడు డాక్టర్ బ్రహ్మానందం స్వీకరించారు మణికొండలోని తన ఇంట్లో మొక్కను నాటి తన సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు.
యాంకర్ ఉదయభాను విసిరిన గ్రీన్ ఛాలెంజ్ లో బ్రహ్మీ..!
By anurag s
-
Read more RELATEDRecommended to you
Telangana: ఇంటర్ లో చేరే విద్యార్థులకు బిగ్ అలర్ట్… ఇవాల్టి నుంచే
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి ఇంటర్ ప్రవేశాలు...
IPL 2024: 10 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేసిన SRH
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లు ఊచ కోత కోశారు. వరి కోసినట్లే...
జగన్ నైజం అందితే జుట్టు అందకపోతే కాళ్లు : చంద్రబాబు
ఎన్నికల్లో జగన్ ఓడిపోతున్నాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం...
Ganesh -