చీట్ చేసి వెంకన్న దర్శనానికి.. ఆ వెంటనే కిడ్నాప్ !

-

తిరుమలలో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన హనుమంతరావు అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు కొందారు దుండగులు. ఎస్.పి.టి రెస్ట్ హౌస్ వద్ద ఈ ఘటన జరగ్గా చాకచక్యంగా ట్రేస్ చేసిన తిరుమల 2 టౌన్ పోలీసులు అలిపిరి వద్దనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తులు అనంతపురానికి చెందిన వారని గుర్తించారు.

ఇక హనుమంతు 20 లక్షలు మోసం చేసినట్లు అనంతపురం జిల్లా పెనుగొండలో కిడ్నాపర్లు గతంలోనే ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. కేసు నమోదు చేసినప్పటి నుంచి పరారీలో వున్న హనుమంతు కోసం గాలిస్తున్నారు కిడ్నాపర్లు. నిన్న తిరుమలలో వున్నట్టు సమాచారం రావడంతో, హనుంతుని కిడ్నాప్ చేసి పెనుగొండకు బయలుదేరారు. అయితే 100 కాల్ చేసి హనుమంతు కుటుంబ సభ్యులకి సమాచారం అందించడంతో వారిని అలిపిరి వద్ద పట్టుకున్న భద్రతా సిబ్బంది కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news