భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రం, శివారులో అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం ఉదయం 10.40 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నగునూర్ చేరుకోనున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి స్థానిక ప్రతిమ వైద్యకళాశాలకి చేరుకుంటారు. కళాశాలలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంతోపాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వైద్యవిద్యార్థులకు బంగారు పతకాలు, ప్రోత్సాహకాలను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, తెలంగాణ గవర్నర్ నరసింహన్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.
నేడు కరీంనగర్ కి రాష్ట్రపతి…
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఈ ఎన్నికలు రామ భక్తులకు, రామద్రోహులకు మధ్య జరుగుతున్నాయి : యోగి ఆదిత్యనాథ్
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గోహత్యను ప్రోత్సహించడం,...
Ganesh -
యమునోత్రికి భారీగా తరలివచ్చిన భక్తులు
చార్ ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి భక్తులు భారీ సంఖ్యలో...
Ganesh -
IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో బిగ్ ఫైట్ జరగనుంది....
Ganesh -