హైదరాబాద్ లో షాకింగ్ ఘటన..పెళ్లి కొడుకు ఇచ్చిన గిఫ్ట్ తో ప్రియుడి తో జంప్..!

-

హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుని. పెళ్ళైన కొద్దిసేపటికే భార్య తన ప్రియుడితో వెళ్ళిపోయింది. పెళ్ళైన ఆనందం లో పెళ్లి కొడుకు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వగా పెళ్లి కూతురు వాటిని కూడా ఎత్తుకెళ్లిది. దాంతో పెళ్లి కొడుకు మరియు కుటుంబ సభ్యులు లబో దిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన బాలాపూర్ లో చోటు చేసుకుంది. బాలాపూర్ కు చెందిన యువతితో బెంగుళూరు కు చెందిన యువకుడికి ఈ నెల 17వ తేదీన నిఖా అయ్యింది.

అయితే పెళ్లి తరవాత తన భార్య కు రూ.2 లక్షల విలువైన ఆభరణాలను వరుడు ఇచ్చాడు. అయితే వాటిని తీసుకున్న వధువు భయటకు వెళ్లి వస్తా అని చెప్పి మళ్ళీ తిరిగి రాలేదు. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మరియు పెళ్లి కొడుకు వెతకడం ప్రారంభించగా తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని తెలిసింది. ఇక తాము ఇచ్చిన ఆభరణాలు ఎత్తుకెళ్ళడం తో వరుడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. యువతి పై ఆమె కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news