థానే బాలిక రేప్ కేసులో సంచలనాలు..15 మంది మీద పడి..!

-

మ‌హ‌రాష్ట్ర‌లోని థానేలో ఓ మైన‌ర్ బాలిక‌పై మాన‌వ మృగాళ్లు 33 మంది అత్యాచారం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కేసు విచార‌ణ‌లో సంచ‌ల‌నాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. బాలిక‌కు మొద‌ట‌గా విజ‌య్ అనే యువ‌కుడు ఫేస్ బుక్ ద్వారా ప‌రిచ‌య‌మైన‌ట్టు విచార‌ణ‌లో తేలింది. విజ‌య్ బాలిక పై జన‌వ‌రి 29న మొద‌టి సారి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆ స‌మ‌యంలో వీడియో తీసి త‌న స్నేహితుల‌తో పంచుకున్నాడు. తన స్నేహితుల‌తోనూ శృంగారం చేయాల‌ని బాలిక‌ను బ‌లవంతం చేశాడు.

ఒప్పుకోక‌పోవ‌డంతో బ్లాక్ మెయిల్ చేయ‌డం ప్రారంభించాడు. ఇక సెప్టెంబ‌ర్ 22న బాలిక‌పై మొత్తం 15మంది ఒకేరోజు అత్యాచారం చేశారు. అంతే కాకుండా ఇప్ప‌టివ‌ర‌కూ త‌న‌పై మొత్తం 33 మంది అత్యాచారం చేసిన‌ట్టుగా బాలిక గుర్తించ‌గా వారంద‌రినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నింధితుల్లో కాలేజీ విద్యార్థులు, డ్రాప్ అవుట్ లు, చిరు ఉద్యోగాలు చేశేవారు ఉన్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news