Samantha: అవన్నీ పుకార్లే..! విడాకులపై ఫస్ట్ టైమ్‌ స్పందించిన సమంత..

-

Samantha: టాలీవుడ్లో వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తూ.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న న‌టి అక్కినేని స‌మంత నాగ చైతన్య. స‌మంత .. కేవలం సినిమాల్లోనే గాక పలు రంగాల్లో సత్తా చాటుతోంది. చైతూను ప్రేమించి పెళ్లి చేసుకున్న త‌రువాత‌.. సినిమాల‌తో పాటు వ్యాపార రంగంలోనూ మరింత జోష్ పెంచింది.

కానీ, గ‌త కొన్ని రోజులుగా స‌మంత‌, చైతూల జంట‌పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. త్వరలో వీరిద్ద‌రూ విడిపోతున్నారని, విడాకులు తీసుకుంటున్నారని పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా స‌మంత విడాకుల‌కు ఓకే అన్న‌ద‌ని.. భరణం కింద రూ. 250 కోట్లు అడుగుతోంది అంటూ రకరకలా వార్తలు హల్చల్ చేశారు. అయినా ఈ విష‌యంపై ఇద్దరూ స్పందించలేదు. దీంతో సామ్, చై అభిమానులు గందరగోళంలో ప‌డ్డారు. ఈ నేపథ్యంలో రూమ‌ర్స్‌పై స‌మంత‌ ఫస్ట్ టైమ్ స్పందించింది. రూమర్స్ కు చెక్ ప‌డేలా షాకింగ్‌ విషయాలను వెల్లడించింది.

ఇటీవ‌ల తన దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత సోషల్‌ మీడియాలో అభిమానులతో చాట్‌ చేసింది. నన్ను ఏం అడగాలనుకుంటున్నారో రెడీ అవ్వండి అని తెలిపింది. ఆ సమయంలోనే ఆమె అభిమాని ఒకరు “మీరు నిజంగా ముంబైకి వెళ్తున్నారా?” అని ప్రశ్నించారు.

తాను ఎక్కడికీ వెళ్లనని, హైదరాబాద్ తన ఇల్లు అని క్లారిటీ ఇచ్చింది. తాము విడిపోతున్న‌మ‌నే పుకారు ఎక్కడ మొదలైందో .. నిజంగా తెలియదని ఎమోష‌న‌ల్ అయ్యారు.అదోక రూమర్ అని.. ఇందులో వాస్త‌వం లేద‌ని, ఎప్ప‌టికీ హైదరాబాదే నా ఇల్లు.. హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తోంది, తాను ఇక్కడే ఉంటానని అని పుకార్లు చెక్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news