హైదరాబాద్ చందానగర్ లో విషాదం..సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలుడు మృతి..!

-

హైద‌రాబాద్ చందానగర్ పాపిరెడ్డి కాలనీ లో విషాదం చోటుచేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలోని సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలుడు మృతి చెందాడు. నిన్న గాలి పటం ఎగురవేస్తూ బాలుడు పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయాడు. దాంతో బాలుడు అరవింద్(7) మృతి చెందాడు. నిన్నటి నుండి బాలుడు కనిపించడం లేదంటూ త‌ల్లి దండ్రులు చందనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిన్నటి నుండి బాలుడి తల్లి తండ్రులు,పోలీసులు అన్ని చోట్లా వెతికినా అత‌డి ఆచూకీ ల‌భించ‌లేదు.

ఈ రోజు ఉదయం సెప్టిక్ ట్యాంక్ లో ఉన్న బాలుడిని స్థానికులు గమనించ‌లేదు. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాలుడి మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘ‌ట‌న పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికులను క‌ల‌చివేసింది. బాలుడి మృతితో రోధిస్తున్న త‌ల్లితండ్రుల‌ను చూసి స్థానికులను కంట‌త‌డి పెట్టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news