సీపీ స్టీఫెన్‌ రవింద్ర సంచలన నిర్ణయం.. ఇన్ స్పెక్టర్, ఎస్ ఐలపై సస్పెన్షన్‌ వేటు !

-

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సంచలన నిర్ణయం తీసుకున్నారు. నార్సింగీ ఇన్ స్పెక్టర్ గంగాధర్, ఎస్ ఐ లక్ష్మణ్ పై సస్పెన్షన్ వేటు వేశారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. నార్సింగీ ఇన్ స్పెక్టర్ గంగాధర్, ఎస్ ఐ లక్ష్మణ్ ల పై తీవ్రమైన భు వివాదాలు, అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సస్పెన్షన్ వేటు వేశారు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర.

నార్సింగీ పొలీస్ స్టేషన్ పరిధిలోని పలు భూ వివాదం లో తల దూర్చిన ఇన్స్పెక్టర్ గంగాధర్…. జన్వాడ లోని ఓ భూమి విషయంలోనూ తలదూర్చాడు. ఈ తరుణంలోనే సైబరాబాద్ సిపీ స్టీఫెన్‌ రవీంద్ర ను నేరుగా ఫిర్యాదు చేశారు బాధితుడు రవీందర్ రెడ్డి. దీంతో గంగాధర్ తో పాటు ఎస్ ఐ లక్ష్మణ్ ను సస్పెండ్ చేశారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. నార్సింగీ ఇన్ స్పెక్టర్ గంగాధర్, ఎస్ ఐ లక్ష్మణ్ ల బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news