ఆర్యన్, కంగానా గాడిదలకు రూ.34వేలు.. ఎక్కడ అమ్మారంటే?

-

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, బాలీవుడ్ నటి కంగానా రనౌత్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేర్లు. డ్రగ్స్ కేసులో అరెస్టయి ఒకరు వార్తల్లో నిలిస్తే.. మరొకరు వివాదాస్పద వ్యాఖ్యలతో దేశం దృష్టిని ఆకర్షించారు. ముంబయి నుంచి గోవా వెళ్తున్న షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు దాడి చేయడం, ఆర్యన్‌ఖాన్ పట్టుబడటం, ఆ తర్వాత రిమాండు, ఎన్‌సీబీ అధికారి సచిన్ వాంఖడే‌పై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆర్యన్‌ఖాన్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. మరోవైపు ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కంగానా రనౌత్ మరోసారి నోటికి పనిచెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో కాదని, 2014లో అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఈ విషయమై పలువురు కంగానాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే, వీరి పేర్లు చెప్పుకొని ఓ గాడిదల వ్యాపారి మాత్రం జేబు నింపుకున్నాడు.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ సమీపంలో శిప్రా నది దగ్గర గాడిదలు, గుర్రాల మేళాలు నిర్వహిస్తుంటారు. అయితే, గాడిదలు త్వరగా అమ్ముడు పోవడం కోసం, మంచి ధర కోసం వ్యాపారులు ఓ కిటుకును పాటిస్తుంటారు. ఇటీవల కాలంలో దేశంలో మర్మోగిపోయిన పేర్లను గాడిదలకు పెడుతుంటారు. దీనివల్ల వారికి మంచి ధర వస్తుంటుంది.

ఓ వ్యాపారి తన గాడిదలకు కంగానా-ఆర్యన్ అని పేరు పెట్టి రూ.34వేలకు విక్రయించాడు. మరోవ్యాపారి వ్యాక్సిన్ అనే గాడిదను రూ.14వేలకు అమ్మాడు. గాడిదలకు మంచి ధర రావడం కోసం ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తుల పేర్లు పెడుతుంటామని అక్కడి వ్యాపారులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news