యూపీలో దారుణం.. పంట పొలాల్లో నగ్నంగా యువతి శవం!

-

దేశంలోని మహిళలపై దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో మూలన కొందరు దుర్మార్గులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం చోటు చేసుకుంది. పంట పొలాల్లో 19 సంవత్సరాల ఓ యువతి శవం కలకలం రేపింది. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుందని సమాచారం అందుతోంది. ఇక ఆ శవాన్ని చూసిన వ్యవసాయదారులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ యువతి శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

crime

అలాగే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు. అయితే.. తమ కూతుర్ని ఓ వ్యక్తి ప్రేమిస్తున్నాడని టార్చర్ చేసేవాడని.. తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తరచూ తమ అమ్మాయి వెనక పడి వేధించేవాడని తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యక్తి తమ కూతుర్ని అత్యాచారం చేసి చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఇక వారి ఆరోపణల మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా ఆ యువకుడే అత్యాచారం చేసి చెప్పాడా ? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news