మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా సింగ‌ర్ సిద్ శ్రీ‌రామ్!

-

సింగ‌ర్ సిద్ శ్రీ‌రామ్ గురించి ప్ర‌స్తుతం ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవస‌రం లేదు. ఎందుకంటే.. త‌న పాట‌ల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందిని ఆక‌ట్టుకున్నాడు. అటు త‌మిళ ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను తన వాయిస్ తో ఇంప్రెస్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌నకు తమిళం, తెలుగులో చాలా అభిమానులు ఉన్నారు. కొన్ని సినిమాలు హిట్ కావ‌డానికి కార‌ణం సిద్ శ్రీ‌రామ్ పాట‌లే అని చెబుతుంటారు. అయితే సిద్ శ్రీ‌రామ్ సింగ‌ర్ గా మొద‌టి సారి మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌డలి అనే సినిమాతో పరిచ‌యం అయ్యారు.

అయితే ప్ర‌స్తుతం ఈ సెన్సేష‌నల్ సింగ‌ర్ సిద్ శ్రీ‌రామ్ హీరో అవుతున్న‌ట్టు తెలుస్తుంది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఒక సినిమాలో హీరో పాత్ర‌లో సిద్ శ్రీ‌రామ్ ను ఎంచుకున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా త‌మిళ్ లో విడుద‌ల అవుతుంద‌ని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త కోలీవుడ్ లో తెగ చెక్క‌ర్లు కొడుతుంది. కాగ హీరో పాత్ర చేయ‌డానికి సింగ‌ర్ సిద్ శ్రీ రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అయితే సింగ‌ర్ గా అద‌ర‌కొట్టిన సిద్ శ్రీ‌రామ్ మ‌రి హీరోగా ఎలా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Latest news