మెదక్ జిల్లా పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్రం అతిథి అధ్యాపక పోస్టు ఖాళీ అయినందున ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ నర్సింలు తెలియజేశారు. రసాయన శాస్త్రంలో పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని, కళాశాలలో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 10న సాయంత్రం 4 గంటల వరకు కళాశాలకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకొని రావాలని తెలిపారు.
మెదక్: ఆ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
By Naga Babu
-
Previous article
Next article