సిద్దిపేట జిల్లా యువకుడికి అంతర్జాతీయ అవార్డు

-

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మీర్జాపూర్‌ గ్రామానికి చెందిన యువకుడు గంగారపు మల్లేశం అంతర్జాతీయ సాహస అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ నెల 2 నుంచి 8 వరకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని పచ్‌మడిలోని వింద్యా సత్పుర పర్వతాలపై ఉన్న జాతీయ సాహస కేంద్రంలో జరిగిన 23వ అంతర్జాతీయ సాహస శిబిరంలో సాహస క్రీడల్లో మల్లేశం తన అత్యున్నత ప్రతిభను కనబరిచాడు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news