గుడ్ న్యూస్ : నాగార్జున కొండ లాంచీ ప్ర‌యాణాల‌కు అనుమ‌తి

-

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా రెండున్న‌ర‌ సంవ‌త్స‌రాల క్రితం నాగార్జున కొండ లాంచీ ప్ర‌యాణాల‌ను ప్ర‌భుత్వం మూసివేసింది. తాజా గా నాగార్జున కొండ లాంచీ ప్ర‌యాణాల‌పై రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ‌ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి నాగార్జున కొండను చూడ‌టానికి లాంచీ ప్ర‌యాణాల‌కు అనుమ‌తి ఇస్తు ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. దీంతో నేటి నుంచి సంద‌ర్శ‌కులు నాగార్జున కొండ‌ను తిల‌కంచ‌డానికి అనుమ‌తి ఉంటుంది. అలాగే లాంచీలో ప్ర‌యాణం చేయ‌డానికీ అనుమ‌తి ఉంటుంది.

కాగ క‌రోనా వైర‌స్ వ్యాప్తి భార‌త్ లో ప్రారంభం అయిన నాటి నుంచి దాదాపు రెండున్న‌ర ఏళ్ల పాటు లాంచీ ప్ర‌యాణాల‌ను రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ‌ నిలిపివేశింది. కాగ ప్ర‌స్తుతం సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో లాంచీ ప్ర‌యాణాల‌ను తిరిగి ప్రారంభించింది. రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ ఉన్న‌త అధికారుల స‌మ‌క్షంలో నేటి నుంచి నాగార్జున కొండ సంద‌ర్శించ‌డానికి లాంచీ ప్ర‌యాణాలు ఉంటాయ‌ని తెలిపింది. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ లోని గుంటూర్ జిల్లాలో మాచర్ల మండ‌లం లో గ‌ల నాగార్జున కొండ ను చూడ‌టానికి లాంచీ ప్ర‌యాణం చేస్తారు. ఇది ప‌ర్యాటకం ప‌రంగా చాలా అభివృద్ధి అయింది.

ప్ర‌స్తుతం లాంచీ ప్ర‌యాణాల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో.. ప్ర‌తి రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు లాంచీ ప్ర‌యాణాలు ప్రారంభం అవుతాయి. లాంచీ ప్ర‌యాణానికి పెద్ద‌లకు రూ. 150, పిల్ల‌ల‌కు రూ. 120 టికెట్ ధ‌ర ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news