నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆయన చితికి రెండో కుమారుడు కల్యాణ్ నిప్పంటిచారు. ఈ కార్యక్రమం చివరి వరకు అక్కడే ఉన్న.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హరికృష్ణ సోదరులు జయకృష్ణ, బాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. వీరితో పాటు సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనియవాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ మంత్రులు నారా లోకేశ్, ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొడాలి నాని, పలువురు రాజకీయ ప్రముఖులు, తెదేపా శ్రేణులు, నందమూరి అభిమానులు భారీగా పాల్గొన్నారు.
ముగిసిన రథసారథి అంత్యక్రియలు
-
Previous article
Next article