తమ కుటుంబ సభ్యులే మోసం చేయడంతో రోడ్డున పడ్డ స్టార్ హీరోయిన్లు..!!

-

సాధారణంగా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాము అంటే వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోని సన్నివేశాలు చాలానే ఉన్నాయి అయితే మరి కొన్ని కుటుంబాలలో హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అలా సంపాదించిన డబ్బు మొత్తాన్ని కుటుంబ సభ్యులకే ఖర్చుపెట్టడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులు మోసం చేయడంతో చివరికి రోడ్డున పడ్డ ఎంతో మంది హీరోయిన్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే నమ్మడం అతిశయోక్తి కాదు. ఇక మహానటి సావిత్రి మొదలుకొని నిన్నటితరం షకీలా వరకు ఇలా చాలా మంది కుటుంబ సభ్యులే మోసం చేయడంతో రోడ్డున పడ్డారు. ఇక ఎవరెవరు కుటుంబ సభ్యుల చేతిలో మోసపోయారు అనే విషయం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

సావిత్రి:Savitri stood out when South film was ruled by NTR, Nageswara Rao. Movies waited for herమహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలనాటి అగ్ర హీరోలందరి సరసన నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించ గలిగిన మహానటి అని చెప్పవచ్చు. హీరోలతో సమానంగా పారితోషకం అందుకుని దానధర్మాలు ఎక్కువగా చేసి నమ్మిన వాళ్లు మోసం చేయడంతో చివరకు మద్యానికి బానిసై ఒక సంవత్సరం పాటు కోమాలో ఉండి ఎవరూ లేని అనాధ గా జీవితాన్ని చాలించింది.

సిల్క్ స్మిత:Silk Smitha's death continues to be a mystery even after 24 years | Telugu Movie News - Times of Indiaఎవరి సహాయం లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వ్యాంప్ పాత్రలు పోషించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె, ఐటమ్ సాంగులకు పెట్టింది పేరుగా మిగిలిపోయింది. ఈమె డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూసేవారు అంటే ఇక ఈమె క్రేజ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే చివరికి అయిన వారి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంది.

భానుమతి :Pin on I Luv Cinema.IN Flashbacksఅందం , అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భానుమతి సినిమాల్లోనే కాదు బయట ప్రపంచంలో కూడా చాలా పద్ధతిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది . ఇక హీరోల కంటే ఎక్కువ పారితోషకం తీసుకున్న ఈమె నా అనుకున్న వాళ్లకు ఆస్తి మొత్తం చేతిలో పెట్టడం తో వారు మోసం చేశారు. ఇక చివరికి ఆశ్రయం లేక రోడ్డున పడింది.

వీరితోపాటు కాంచన , శ్రీ దివ్య, షకీలా, కన్నాంబ లాంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్లు అయిన వాళ్ళ చేతుల్లోనే మోసపోయి చివరికి కొంత మంది రోడ్డున పడితే.. మరికొంత మంది ప్రాణాలు వదిలారు.

Read more RELATED
Recommended to you

Latest news