నుపుర్ శర్మ మాట్లాడింది అంతా నిజమే: నెదర్లాండ్స్ ఎంపీ

-

నుపుర్ శర్మ వ్యాఖ్యలపై అంతర్జాతీయం దుమారం రేగుతోంది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ముస్లిం వర్గాలు, ముస్లిం దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖతార్, కువైట్, ఇరాక్, లిబియా, టర్కీ, మలేషియా దేశాలు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. దీనికి తగ్గట్లు ఇండియాలోని ప్రజానీకం కూడా నుపుర్ శర్మకు మద్దతుగా నిలుస్తున్నారు. ఖతార్ దేశానికి నిరసనగా బాయ్ కాట్ ఖతార్ ఎయిర్ లైన్స్ అంటూ హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేశారు. 

ఇదిలా ఉంటే నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నుపుర్ శర్మకు మద్దతు ప్రకటించారు. తాజాగా కొన్ని దేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. తాజాగా నెదర్లాండ్స్ ఎంపీ, ఫ్రీడం పార్టీ చీఫ్ విల్డెర్స్ మద్దతుగా నిలిచారు. ఆమె మాట్లాడిందంతా నిజమే అని ఆయన అన్నారు. అరబ్ దేశాలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించాడు. నుపుర్ శర్మ తప్పుడు ఆరోపణలు చేయలేదు, భారత్ ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. బుజ్జగింపు ఎప్పటికీ పనిచేయదని.. దాని వల్ల పరిస్థితులు మరింతగా దిగజారుతాయని అన్నారు. ఇస్లామిక్ దేశాలకు భయపడవద్దని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news