శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆర్జితసేవాటికెట్లు రేపే విడుదల

-

తిరుమల….శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. రేపు ఆన్ లైన్ లో సెప్టెంబర్‌ మాసంకు సంభందించిన ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. ఇందులో భాగంగానే… 46, 470 సేవా టిక్కేట్లను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనుంది టిటిడి.

లక్కి డిఫ్ విధానంలో 8070 టిక్కేట్లు….ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపాదికన 38400 టిక్కేట్లను విడుదల చెయ్యనుంది టిటిడి పాలకమండలి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవా టిక్కేట్లను లక్కిడిఫ్ విధానంలో కేటాయించనుంది టిటిడి పాలకమండలి.

కాగా.. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. ఇవాళ సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న 94,411 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 46,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండీ ఆదాయం రూ.3.41 కోట్లు గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news