పక్కా ప్లాన్ ప్రకారమే..హోటల్‌లో నరేశ్-పవిత్ర లోకేశ్ మీటింగ్..!?

-

టాలీవుడ్ సీనియర్ హీరో నరేశ్ కొద్ది రోజుల కిందట నటి పవిత్ర లోకేశ్ తో కలిసి ఓ హోటల్ లో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పవిత్ర లోకేశ్-నరేశ్ పెళ్లి చేసుకోబోతున్నారని ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. వారు హోటల్ లో కనిపించిన క్రమంలో నరేశ్ భార్య రమ్య రఘుపతి చెప్పుతో దాడి చేయబోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయింది కూడా. అయితే, నరేశ్ పవిత్ర లోకేశ్ ను హోటల్ లో కలవడం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని సోషల్ మీడియా లో వార్తలొస్తున్నాయి.

ఆ వార్తల ప్రకారం..నటుడు నరేశ్ ..ప్లాన్ ప్రకారమే హోటల్ లో పవిత్ర లోకేశ్ ను కలిశాడని ఆరోపిస్తున్నారు. రమ్య రఘుపతి నుంచి డైవోర్స్ తీసుకోవడానికి ఎంతో కాలం నుంచి నరేశ్ ప్రయత్నిస్తున్నాడని, అయితే, రమ్య విడాకులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నరేశ్, పవిత్ర లోకేశ్ హోటల్ లో ఉన్నారనే విషయం రమ్యకు తెలిసేలా చేసి ఇలా గొడవ చేశాడని అంటున్నారు.

హోటల్ లో జరిగిన గొడవ వలన నరేశ్ కు రమ్య రఘుపతి నుంచి విడాకులు ఈజీ అవుతుందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఆ ప్రకారంగా నరేశ్..కావాలనే ఇలా పవిత్ర లోకేశ్ ను హోటల్ లో కలిశాడనే ప్రచారం జరుగుతోంది. మరో వైపున పవిత్ర లోకేశ్ ను తాను పెళ్లి చేసుకున్నానని, తన భార్య పవిత్ర లోకేశ్ అని పవిత్ర లోకేశ్ భర్త సుచేంద్ర ప్రసాద్ ప్రకటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news