విద్యార్థుల కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్..ప్రతి ఏడాది స్కాలర్‌షిప్..!

-

ఇండియా పోస్టాఫీస్ ఇప్పటికే ఎన్నో సేవింగ్ స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు..వాటన్నిటికీ కూడా మంచి స్పందన వచ్చింది..మంచి లాభాలతో పాటుగా సేఫ్ కూడా..అందుకే పోస్టాపీసు కొత్త స్కీమ్ లను అందిస్తూ వస్తుంది.ఈ మేరకు ఇప్పుడు మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది.విద్యార్థుల కోసం బంపరాఫర్‌ను ప్రకటించింది. దీన్‌ దయాళ్‌ పథకంలో భాగంగా ‘స్పార్ష్‌ యోజన’ పేరుతో విద్యార్థులకు స్కాలర్‌ షిప్స్‌ను అందిస్తోంది.

ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదువుకుంటున్న చిన్నారులు ఈ స్కాలర్‌ షిప్‌ పొందడానికి అర్హులు. మొత్తం 920 మందికి స్కాలర్‌ షిప్‌లను అందించనున్నారు. ప్రతి పోస్టల్‌ సర్కిల్‌కు 40 స్కాలర్‌ షిప్స్‌ చొప్పున అందించనున్నారు. నాలుగు నెలకొకసారి రూ. 1500 చొప్పున, ఏడాదికి రూ. 6000ను అందిస్తారు. ఈ స్కాలర్‌ షిప్‌ పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎటువంటి అర్హతలు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
6 నుంచి 9వ తరగతి చదువుతోన్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్‌కు అర్హులు. అకడమిక్‌ రికార్డుతో పాటు తపాలా బిళ్లల సేకరణ హాబీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థులను ఫిలాటెలీ రిటన్‌ క్విజ్‌, ఫిలాటెలీ ప్రాజెక్ట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.అర్హత కలిగిన విద్యార్థులు ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

అడ్రెస్:

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఫిలాటెలీ),
చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌, తెలంగాణ సర్కిల్‌, డాక్‌ సదన్‌, అబిడ్స్‌, హైదరాబాద్‌-500001 అడ్రస్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు 26-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. తెలంగాణ పోస్టల్‌ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఫిల్‌ చేసి ఆఫ్‌లైన్‌ విధానంలో సబ్‌మిట్ చేయాలి..పూర్తి సమాచారం కోసం పోస్టల్ వెబ్ సైట్ ను సందర్సించాలి..

Read more RELATED
Recommended to you

Latest news