నితిన్ పాటకి చిందులేసిన క్రికెటర్ యుజువేంద్ర చాహల్ భార్య

-

టాలీవుడ్ యువ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ తెరెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ ప్రాజెక్టు ఆగస్టు 12న థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే ఈ చిత్రంలో చివరి పాటైనా ఐటమ్ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ కానుంది. హీరోయిన్ అంజలి ఐటమ్ సాంగ్ లో కనువిందు చేయనుంది. కాగా టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

చాహల్ ధనశ్రీ వర్మను డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నాడు. ధనశ్రీ వర్మ ఓ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియాలోనూ చాలా ఫేమస్. ఆమె తరచూ తన డాన్స్ వీడియోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ధనశ్రీ ” రాను రాను అంటూనే చిన్నదో ” అనే మాస్ బీట్ ను రీ క్రియేట్ చేసింది. మీరు మాట్లాడకపోయినా.. మీలో ఉన్న శక్తి ఎప్పుడూ గట్టిగా మాట్లాడుతుంది. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news