యడియూరప్పకు బెంగళూరు కోర్టు షాక్.. ఆ స్కామ్​పై దర్యాప్తునకు ఆదేశం

-

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన కుటుంబానికి బెంగళూరు కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించింది. యడియూరప్ప, ఆయన కుటుంబం కోట్ల రూపాయల లంచం తీసుకున్నారంటూ దాఖలైన ప్రైవేట్ పిటిషన్ పై విచారణ చేపట్టింది.

అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. తుది నివేదిక ఇచ్చేందుకు నవంబర్​ 2 వరకు గడువు ఇచ్చింది. అదే రోజున తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేసింది.

టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త 2021 జూన్​లో ఈ పిటిషన్​ వేశారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగా.. కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకుని బెంగళూరు డెవలప్​మెంట్ అథారిటీ(బీడీఏ) పరిధిలోని హౌసింగ్ ప్రాజెక్టు కాంట్రాక్టును రామలింగం కన్​స్ట్రక్షన్​ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర, కుమార్తె పద్మావతి బంధువు శశిధర్​ను నిందితులుగా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news