కేసీఆర్ ఆ జన్మ ఎందుకు… ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు – వైఎస్ షర్మిల

-

నిర్మల్ లో పర్యటించిన YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సీఎం కేసీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఅర్ జన్మ కి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని… తెలంగాణలో రైతుకు విలువే లేకుండా పోయిందని ఆగ్రహించారు. తెలంగాణ లో అప్పు లేని రైతు లేనే లేడని.. రుణమాఫీ అని రైతులను మోసం చేశాడు కదా అని ప్రశ్నించారు.

ఉద్యోగాలు లేక నిరుద్యోగులు హత్మహత్యలు చేసుకుంటున్నారని…. ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఅర్ లో కనీసం చలనం కూడా లేదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఆయన ఛాతీలో ఉన్నది గుండె కాదు బండ అని.. ఉద్యోగాలు అడిగితే హమాలి పని బెస్ట్ అంటున్నారన్నారు. దొడ్డు బియ్యం ఇస్తూ రేషన్ దుకాణాల్లో నిత్యావసర వస్తువులను బంద్ పెట్టాడు… పేదవాడు ఎలా బ్రతుకుతున్నారు అని చుసే వ్యవస్థ లేదని ఆగ్రహించారు.

కనీసం ఒక అధికారి కూడా ప్రజల వైపు చుసే పరిస్థితి లేదు.. రాష్ట్రంలో 13 లక్షల పెన్షన్ల దరకాస్తులు పెండింగ్ లో ఉన్నాయని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. మండిపడ్డారు.
తెలంగాణ లో ప్రజల పట్ల నిలబడే వ్యవస్థ లేదు.. కేసీఅర్ అరాచకాలను ప్రతి పక్షాలు ప్రశ్నించలేదని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news