సీఎం సభతో బీజేపీ నేతలకు దిమ్మతిరుగుతుంది – హరీష్ రావు

-

చండూరులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభతో బిజెపి నేతలకు దిమ్మ తిరిగిపోయిందని అన్నారు మంత్రి హరీష్ రావు. అందుకే గంటకు ఓ నాయకుడు మీడియా సమావేశం పెట్టి విమర్శించారని దుయ్యబట్టారు. వారు గల్లీ నేతలకంటే దిగజారి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బిజెపి నేతలు నోటికి వచ్చినట్లు వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో టిఆర్ఎస్ గెలుపు ముమ్మాటికి ఖాయమైందని అన్నారు హరీష్ రావు.

బిజెపి అబద్ధాలకు డిఎన్ఏ గా మారిపోయింది అన్నారు. మునుగోడు ప్రజలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని.. టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయి అన్నారు. మునుగోడు నియోజకవర్గం లో 40 వేలకు పైగా ఆసరా పింఛన్లు వస్తున్నాయని చెప్పారు. ఈ ఎనిమిదేళ్లలో బిజెపి ఏం చేసిందో చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. వందల కోట్లు ఆశ చూపి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news