మయో సిటీస్ వ్యాధిపై పోరాడి, గెలుస్తాను – సమంత ఎమోషనల్‌

-

స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సమంత ఇటీవల అనారోగ్యానికి గురైన విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తనకు మయో సిటీస్ అనే వ్యాధి వచ్చిందని, అందుకే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు , అభిమానులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ వ్యాధిని తలచుకుని ఏడ్చేసింది.

యశోద ప్రమోషన్స్‌ లో భాగంగా యాంకర్‌ సుమ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది సమంత. ఈ నేపథ్యంలో… యో సిటీస్ అనే వ్యాధి గురించి సమంతను సుమ అడిగింది. దీంతో ఆ వ్యాధిపై సమంత స్పందిస్తూ.. కొన్ని మంచి రోజులు ఉంటాయి అలాగే కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఇంకొక అడుగు ముందే వేయలేకపోయానా అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అయింది సమంత. ఒక్కసారి ఇంత దాటి వచ్చినా పంపిస్తుంది అంటూ పేర్కొన్నారు. దీనిపై పోరాటం చేయాలి అంటూ పిలుపునిచ్చారు సమంత. ఇలా పోరాటం చేస్తున్నది నేను ఒక్కదాన్నే కాదు చాలామంది పోరాటం చేస్తున్నారు అని తెలిపారు. నేను పోరాటం చేస్తాను అలాగే గెలుస్తాను అని సమంత స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అయితే నేను చావలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు సమంత.

Read more RELATED
Recommended to you

Latest news