సరోగసితో తల్లిదండ్రులైన సెలబ్రిటీస్ ఎవరెవరంటే..

-

ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్య సమస్యలతో పిల్లల్నీ కనటానికి సరోగసి పద్ధతిని ఎంచుకుంటున్నారు.. అందులో ముఖ్యంగా సెలబ్రిటీలు పలు కారణాలతో ఈ పద్ధతిని ఫాలో అవుతూ తల్లితండ్రులుగా మారారు అయితే వారెవరో ఒకసారి చూద్దాం.కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార విగ్నేష్ శివన్ సరోగసి విధానంలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. ఈ విషయం పెద్ద దుమారాన్ని రేపినా చివరికి అంతా సద్దుమణిగింది..

అలాగే టాలీవుడ్ నటి మంచు ల‌క్ష్మి సరోగసి ద్వారా ఓ ఆడ బిడ్డను కన్నారు. గుజ‌రాత్‌కు చెందిన ఓ మహిళ ద్వారా.. ఈమె బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తుంది.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, గౌరీ దంప‌తులు ఇద్దరు పిల్లల తర్వాత మూడో కుమారుడిని సరోగసి ద్వారా పొందారు. ఆ బాబు పేరు అబ్రామ్ ఖాన్. బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా కూడా ఇదే విధానంలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. బాలీవుడ్ నటి స‌న్నీలియోన్ ఒక పాపను దత్తత తీసుకున్నారు. త‌ర్వాత‌ ఇద్దరు మగ పిల్లలను సరోగసి పద్ధతిలో కన్నారు.. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంప‌తులు కూడా స‌రోగ‌సి ద్వారా కుమారుడికి జన్మనిచ్చారు. పేరు ఆజాద్ రావ్. హిందీ నటుడు తుషార్ కపూర్ కూడా సరోగసి ద్వారా ఓ కొడుకును కన్నాడు.. తుషార్ కపూర్ పెళ్లి చేసుకోలేదు.. అలాగే ఆయన సోదరీ అయినా ఏక్తాకపూర్ కూడా ఈ రకంగానే ఓ బిడ్డను కన్నది.. ఇంకా విశేషం ఏంటంటే వీరిద్దరికీ సరోగేట్ మదర్ ఒకరే.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తనకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదంటూ.. పెళ్లి చేసుకోకుండా సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు.. అలాగే అమెరికన్ సింగర్ నిక్ జోనస్ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా కూడా సరోగసి పద్ధతిలో ఒక పాపకు జన్మనిచ్చింది..

Read more RELATED
Recommended to you

Latest news