మహేశ్, బన్నీ మల్టీ స్టారర్! ఇది సూపర్ గురూ .!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేశ్ అందంతో, నటన తో ప్రజల్లో ముద్ర వేశాడు. ఇక అల్లు అర్జున్ తన డాన్స్ టాలెంట్ తో టిపికల్ బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకుల ఆదరణ సంపాదించు కున్నాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమా తో పాన్ ఇండియా గ్రూప్ లో చేరి పోయాడు. ఇక సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న మహేష్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ద్వారా పాన్ వరల్డ్ కు గురి పెట్టి ఉన్నాడు.

ఇక వీరిద్దరికీ గతంలో అల్లు అర్జున్  అల వైకుంఠ పురంలో, మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాల విడుదల విషయంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో మహేశ్ బాబు అల్లు అర్జున్ ను ఆయన మార్కెట్ ఎంత అని అన్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అయినా కూడా అల్లు అర్జున్ కూడా ఎక్కడా తగ్గకుండా తన సినిమా రిలీజ్ చేసి మహేష్ బాబు కంటే పెద్ద హిట్ కొట్టాడు.

ఇక అప్పటి నుండి వారిద్దరూ ఒకే స్టేజ్ మీదకు రావటం అరుదుగా జరుగుతోంది.కాని ఇన్నాళ్లకు ఇద్దరి కామన్ ఫ్రెండ్ అయిన గుణశేఖర్ వల్ల ఇద్దరు స్టార్స్ ఒకే స్టేజ్ మీదకు వచ్చి సందడి చేశారు. ఇది  డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తే నీలిమా వెడ్డింగ్ రిసెప్షన్ లో జరిగింది. ఈ ఫంక్షన్ కు ఎంతమంది వచ్చినా  అల్లు అర్జున్, మహేష్ ఓకేసారి వేదికపై ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మరో వైపు బన్నీ. మహేష్ బాబు తో మల్టీ స్టారర్ ప్లాన్ చేయాలని ప్యాన్స్ కోరుకుంటున్నారు. దీని బాధ్యత రాజమౌళి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news