Telangana : నేటి నుంచి రేవంత్‌రెడ్డి హాథ్‌ సే హాథ్‌ జోడో పాదయాత్ర

-

తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ్టి నుంచి హాథ్ సే హాథ్ జోడో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధి నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి రేవంత్.. ముందుగా ములుగు జిల్లా గట్టమ్మ, సాయిబాబా ఆలయాల్లో పూజలు చేస్తారు. అక్కడి నుంచి మేడారానికి చేరుకుని వనదేవతలను దీవెనలు తీసుకుని మధ్యాహ్నం 12 గంటల నుంచి యాత్ర మొదలు పెడతారు.

కొత్తూరు, నార్లాపూర్ గోవిందరావుపేట ప్రాజెక్ట్ నగర్ అక్కడినుంచి పస్రా వరకూ వచ్చి అక్కడి కూడలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం… గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్, వెంకటాపూర్ మండలం జవహర్ నగర్, ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్, ఇంచర్ల, వెంకటాపూర్ క్రాస్ మీదుగా పాలంపేట చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి…రేపు తిరిగి యాత్రను ప్రారంభిస్తారు. రెండు రోజుల పాటు….ములుగు జిల్లాలోనే రేవంత్ రెడ్డి యాత్ర కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news