BREAKING : తన ఆరోగ్యం గురించి సమంత ప్రత్యేక పూజలు

-

టాలీవుడ్ స్టార్ నటి సమంత గత ఏడాది యశోద సినిమాతో మెప్పించారు. మయోసిటీస్ వ్యాధిబారిన పడిన ఈమె పూర్తిగా కోలుకున్నాక సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొనడంతో పాటు హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో కూడా వరుణ్ ధావన్ పక్కన సందడి చేయబోతున్నారు.

ఇది ఇలా ఉండగా, తాజాగా తమిళనాడులో హీరో సమంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని దిండిక్కల్ జిల్లా లోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయం లో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కింద నుంచి కొండపై దాకా ఉన్న మెట్ల మార్గం ద్వారా హారతి వెలిగిస్తూ పై దాకా చేరుకున్నారు సమంత. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పళని సుబ్రమణ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సినీ నటి సమంత.

Read more RELATED
Recommended to you

Latest news